సముద్రంలోకి నగరాలు! వీడియో
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీర నగరాలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని మెక్గిల్ విశ్వవిద్యాలయం అధ్యయనం హెచ్చరించింది. శిలాజ ఇంధన వినియోగం తగ్గించకపోతే ఈ శతాబ్దం చివరి నాటికి వంద మిలియన్లకు పైగా భవనాలు, ఓడరేవులు, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడతాయని వెల్లడించింది. భారతీయ తీర నగరాలైన ముంబై, చెన్నై, లక్షద్వీప్ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి.
వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో తీర నగరాలకు ముప్పు పెరుగుతుందని మెక్గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఓ అధ్యయనం హెచ్చరించింది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించకపోతే, ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్లకు పైగా భవనాలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇది కేవలం నివాస భవనాలకు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఓడరేవులకు, శుద్ధి కర్మాగారాలకు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తుందని ఆ అధ్యయనం తెలిపింది. ఈ నివేదిక నేచర్ అర్బన్ సస్టెయినబిలిటీ జర్నల్లో ప్రచురితమైంది.
మరిన్ని వీడియోల కోసం :
