అవుట్ సైడ్ ఫుడ్ తింటే దవాఖానలో బెడ్డే..!

Updated on: Apr 08, 2026 | 6:01 PM

బయటి ఆహారం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, పాత ఫుడ్‌ను వేడి చేసి అమ్మడం వంటివి నిత్యం వెలుగుచూస్తున్నాయి. గుంటూరులో అల్లం తొక్కడం, హైదరాబాద్‌లో పాచిపోయిన బిర్యానీని జొమాటో ద్వారా విక్రయించడం వంటి ఘటనలు ఆహార భద్రతా అధికారుల తనిఖీలలో బయటపడ్డాయి. కఠిన చర్యలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

బయటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారని ఇటీవల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గుంటూరు నగరంలోని పలు హోటళ్ళలో అపరిశుభ్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. జీటీ రోడ్‌లోని శుభం హోటల్‌లో కాళ్లతో అల్లం తొక్కుతూ మసాలా తయారు చేస్తున్నారన్న ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. వైరల్ అయిన వీడియోలను పరిశీలించిన అనంతరం, హోటల్ యజమాని అంగీకరిస్తూ, అది తాత్కాలిక ఉద్యోగి చేసిన తప్పు అని వివరణ ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వరంగల్‌లో కుక్కల అరాచకం! వేలు తెగేలా కొరికిన పిచ్చికుక్క

ఇద్దరు ఇంజినీరింగ్ పిల్లల ప్రాణం తీసిన తాగుబోతు

RAAKA: అట్లీ-బన్నీ మూవీ టైటిల్ ఫిక్స్! ‘రాకా’ పోస్టర్ లో అల్లు అర్జున్ వైల్డ్ లుక్..

Tulip Garden: జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి

అమెరికా పైలట్ రెస్క్యూ నాటకమా ?? “యురేనియం” కోసమే అన్న ఇరాన్‌

Loading...
Unable to load recommendations.
Follow Us