ఏపీలో తుపాన్ బీభత్సం.. సంతకు వెళ్లి వస్తూ వాగులో కొట్టుకుపోయారు
తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. అనంతగిరి మండలం భింపోల్ లో లవ్వ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు సంతకు వెళ్లి వస్తూ గెడ్డ దాడుతుండగా గల్లంతయ్యారు.
తుఫాన్ తీరం దాటినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉదృతి పెరిగింది. ప్రమాదకరంగా ప్రవహించే గెడ్డలు దాటే క్రమంలో.. గిరిజనులు గల్లంతవుతున్నారు. అనంతగిరి మండలం భింపోల్ లో లవ్వ గెడ్డ ఉదృతంగా ప్రవహిస్తోంది. సీతపాడు గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజనులు సంతకు వెళ్లి వస్తూ గెడ్డ దాడుతుండగా గల్లంతయ్యారు. గల్లంతయిన ముగ్గురు గిరిజనులు గెమ్మెల కుమార్, మిరియాల కమల, గెమ్మెల లక్ష్మి కోసం రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. పొద్దు పోయినప్పటికీ వాళ్ళ ఆచూకీ కనిపించలేదు. పిఓ అభిషేక్ స్వయంగా గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన ముగ్గురులో కాశీపట్నం వద్ద కుమార్ మృతదేహం లభించింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను రంగంలోకి దింపే అవకాశం ఉందని అనంతగిరి తహసిల్దార్ రాంబాయి వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైల్ కోచ్ దిగువ భాగం నుంచి వెలువడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
పెళ్లి వేడుకలో బెల్లీ డాన్స్ అదరగొట్టిన తాతగారు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఆటో డ్రైవర్ సాహసం.. తప్పిన పెను ప్రమాదం
కన్నీరు పెట్టుకున్న కిమ్ !! నియంతను ఏడిపించిన వారు ఎవరు ??
డమ్మీ బాంబు అని భావించిన దంపతులకు షాక్ !!
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

