టికెట్లు, థియేటర్లు.. టాలీవుడ్‌లో కొత్త గొడవలు..!

Updated on: May 04, 2026 | 12:55 PM

టాలీవుడ్‌లో థియేటర్ల వివాదం మళ్లీ రాజుకుంది. మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ల కేటాయింపు, సింగిల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ లేఖ విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపుపై కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ వైఖరితో నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. 16 మంది నిర్మాతలు కలిసి ఈ సమస్యలపై చర్చలు జరుపుతున్నారు.

టాలీవుడ్‌లో థియేటర్లు, టికెట్ రేట్ల వివాదం తిరిగి మొదలైంది. “జెట్లీ” సినిమా విషయంలో మల్టీప్లెక్స్‌లు స్క్రీన్లు ఇవ్వకపోవడంపై మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ విధానంపై ఉన్న సమస్యలను లేవనెత్తుతూ, మల్టీప్లెక్స్‌లను ఈ వివాదంలోకి లాగడంపై ఆ లేఖలో ప్రశ్నించారు. ఈ సమస్య మైత్రి వంటి పెద్ద సంస్థలకే వస్తే, చిన్న నిర్మాతల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తాయి.హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్స్ పర్సెంటేజ్ విధానానికే మొగ్గు చూపడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీనికి వ్యతిరేకంగా 16 మంది నిర్మాతలు ఏకమై పత్రికా ప్రకటన విడుదల చేశారు. టికెట్ రేట్ల పెంపు విషయంలోనూ నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Follow Us