Watch Video: భర్తతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో రంభ
ఒకప్పుడు సినీ నటిగా ఓ వెలుగు వెలిగిన అందాల రాశి రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తన భర్తతో కలిసి మంగళవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఒకప్పుడు సినీ నటిగా ఓ వెలుగు వెలిగిన అందాల రాశి రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు టాలీవుడ్లో రీఎంట్రీకి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో రంభ, తన భర్త ఇంద్రకుమార్ పద్మనాభన్తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంభతో కలిసి ఫొటోలు తీసుకునేందుకు అభిమానులు పోటీపడ్డారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న రంభ.. ప్రస్తుతం భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇటీవల నటుడు జేడీ చక్రవర్తితో కలిసి ఓ బుల్లితెర షోలో కనిపించారు రంభ.