శ్రీహాన్ 40 లక్షలు ఎందుకు తీసుకున్నాడో చెప్పేసిన ఆదిరెడ్డి

Updated on: Dec 22, 2022 | 9:35 PM

బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఈ సీజన్ విజేతగా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక ఆ తదుపరి రన్నరప్ గా కీర్తి కాగా.. నాల్గవ స్థానంలో ఆది రెడ్డి.. ఐదవ స్థానంలో రోహిత్ నిలిచారు.

బిగ్ బాస్ సీజన్ 6 ముగిసింది. ఈ సీజన్ విజేతగా సింగర్ రేవంత్ నిలవగా.. రన్నరప్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక ఆ తదుపరి రన్నరప్ గా కీర్తి కాగా.. నాల్గవ స్థానంలో ఆది రెడ్డి.. ఐదవ స్థానంలో రోహిత్ నిలిచారు. అయితే కోట్ల ఆఫర్స్ తిరస్కరించి ఎలిమినేట్ అయ్యారు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి. చివరగా. .. విన్నర్, రన్నరప్ గా ఇద్దరు మిగిలగా.. అందులో శ్రీహాన్ 40 లక్షల రూపాయలు తీసుకుని టైటిల్ రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ నిలిచాడు. ఆ తర్వాత రేవంత్ కంటే శ్రీహాన్ కు ఎక్కువ ఓట్లు వచ్చినట్లుగా నాగార్జున ప్రకటించారు కూడా. అయితే శ్రీహాన్ 40 లక్షల రూపాయలు తీసుకోవడంపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీహాన్ తీరును కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం మద్దతిస్తున్నారు. ఇక రివ్యూయర్, కంటెస్టెంట్ ఆది రెడ్డి తన మనసులోని మాటలను బయటపెట్టారు.

Published on: Dec 22, 2022 09:35 PM
Follow Us