తాత మరణంతో తీవ్ర భావోద్వాగానికి లోనైంది మహేశ్ బాబు కూతురు సితార. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్టింగ్.. ఆమె మాటల్లో చూస్తే.. “ఇకపై వారాంతపు లంచ్ ఎప్పటిలా ఉండదు. మీ దగ్గర నేను చాలా విలువలు నేర్చుకున్నాను. నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవాడివి. ఆ జ్ఞాపకాలన్నీ మరిచిపోలేను. మీరే అసలైన హీరో. మీరు గర్వపడేలా నేను తయారవుతాను. మీరు లేకపోవడం నాకు తీరని లోటు. మిమ్మల్ని మిస్ అవుతున్నాను తాత గారు” అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది సితార.