భాగ్యనగరంలో దిమ్మతిరిగే రెస్పాన్స్‌.. దటీజ్‌ షారుఖ్ ఖాన్..

|

Dec 19, 2023 | 9:54 AM

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు షారుఖ్.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇప్పుడు డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో చాలా కాలం తర్వాత కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు షారుఖ్. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలోనే షారుఖ్ కాన్ తాజాగా ఓ విషయాన్ని వెల్లడించారు. “డంకీ” సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపాడు షారుఖ్. అయితే షారుఖ్ ఖాన్‏కు సౌత్ ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జవాన్ సినిమాకు తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు డంకీ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. శనివారం నుంచి హైదరాబాద్ అభిమానులు సైతం ఇప్పుడు ఆన్‌లైన్‌లో టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ముందుగా సినిమాను చూడాలనుకునే వారు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో టిక్కెట్ల ధర 350 నుండి 250 వరకు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss 7: బిగ్ బాస్ రచ్చరచ్చసజ్జనార్ సీరియస్

రెండో పెళ్లి చేసుకుంటారా ?? సామ్ దిమ్మతిరిగే రియాక్షన్

రైతుబిడ్డ Vs అమర్‌దీప్.. ఫ్యాన్స్‌ రచ్చపై పోలీసులు సీరియస్

Harish Rao: రైతుబిడ్డను చూస్తుంటే గర్వంగా ఉంది.

Pallavi Prashanth: యావర్‌ కారణంగా నష్టపోయిన పల్లవి ప్రశాంత్..

Follow us on