డ్రోన్ తెచ్చిన తంటా.. చిక్కుల్లో దురంధర్ టీమ్..
ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్-2 మూవీ షూటింగ్లో అనధికార డ్రోన్ వాడకంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటనలో, లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకికి నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. ఈ సంఘటన చిత్ర బృందానికి తంటా తెచ్చింది.
రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం దురంధర్-2 షూటింగ్ సమయంలో ముంబై పోలీసులు చిత్ర బృందానికి షాకిచ్చారు. ఫిబ్రవరి 1న దక్షిణ ముంబైలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడాన్ని పోలీసులు గుర్తించారు. షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా, ఒక అనధికార డ్రోన్ ఎగురుతుండగా గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. డ్రోన్ వాడకాన్ని నిర్ధారించిన తర్వాత, ముంబై పోలీసులు చిత్ర లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకికి నోటీసు జారీ చేసి విచారణ ప్రారంభించారు.
మరిన్ని వీడియోల కోసం :