థింక్‌ గ్లోబల్‌ అంటున్న జక్కన్న.. మహేష్‌ కోసం ఏం ప్లాన్‌ చేశారు

Edited By:

Updated on: Nov 04, 2025 | 10:23 PM

రీ రిలీజ్ సినిమాలు ఇప్పటి వరకు చాలా మంది చేసారు కానీ రాజమౌళి అనుకుంటే ఓ సినిమాను ఎలా ప్రమోట్ చేస్తారు.. ఎలా కలెక్షన్స్ తెస్తారు అనేది బాహుబలి ది ఎపిక్‌తో మరోసారి ప్రూవ్ అయింది.. ఈ సినిమాకు 3 రోజుల్లోనే 37 కోట్లు గ్రాస్ వచ్చింది.. పదేళ్ళ నాటి సినిమాతో మళ్లీ మ్యాజిక్ చేశారు జక్కన్న. దీన్నిబట్టి చూస్తుంటే SSMB29కి ఇంకేమేం ప్లాన్‌ చేస్తున్నారో అని గుసగుసలాడుకుంటున్నారు మహేష్‌ ఫ్యాన్స్.

ఇంకెప్పుడు? ఇంకా ఎప్పుడు? అని మహేష్‌ నోరు తెరిచి అడిగేశారు జక్కన్నని. పోనీ.. 2030 కి ప్లాన్‌ చేద్దామా? అని తనదైన స్టైల్‌లోనూ సెటైర్‌ వేశారు. అయినా జక్కన్న ఆ మాటలను ఆస్వాదిస్తున్నారేగానీ.. పక్కాగా.. ఇదీ ప్లాన్‌ అని రివీల్‌ చేయడం లేదు. కానీ రీసెంట్‌గా మహేష్‌ – రాజమౌళి చాట్‌ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. నవంబర్‌ 15న ఇచ్చే గ్లింప్స్ లాంచ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్లోనే జక్కన్న ప్లాన్‌ చేసి ఉంటారని, ఇందులో భాగంగానే మహేష్‌ తో ఇంట్రస్టింగ్‌ చాట్‌ చేశారని మాట్లాడుకుంటున్నారు. ప్రతి సినిమాకీ ముందు ప్రెస్‌ మీట్‌ పెట్టి.. ఇదీ సంగతి.. ఇలా అనుకుంటున్నామని చెప్పడం జక్కన్న స్టైల్‌. కానీ, మహేష్‌ మూవీ రేంజ్‌గ్లోబల్‌ కాబట్టి, ఆ విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు రాజమౌళి. ఈ సారి డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌ ఎట్‌ ఎ టైమ్‌ వైరల్‌ అయ్యే కాన్సెప్టుల కోసమే స్పెషల్‌గా మీటింగులు పెట్టుకుంటున్నారట జక్కన్న. దిమ్మతిరిగే ప్రమోషన్లకు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ రెడీ అంటోంది టీమ్‌. లెట్స్ వెయిట్‌ అండ్‌ సీ అని అంటున్నారు మూవీ లవర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాతవన్నీ థియేటర్లలో.. కొత్త సినిమాలు ఓటీటీల్లో

డార్లింగ్‌ ఇష్టపడుతుంటే.. యంగ్‌ టైగర్‌ వద్దనుకుంటున్నారా

ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి.. తల్లినే చంపింది

డిన్నర్‌ డేట్‌కి ముగ్గురు బిలియనీర్లు .. ఫొటోలు వైరల్‌

రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు

Published on: Nov 04, 2025 10:22 PM