ప్రభాస్ VS రణ్వీర్ వార్పై సంజయ్దత్ రియాక్షన్
ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్! సౌత్.. నార్త్ అని తేడా లేకుండా కలెక్షన్స్ కుమ్మేస్తున్న మన తెలుగు స్టార్. ఇక రణ్వీర్ సింగ్!సక్సెస్ఫుల్గా డిఫరెంట్ జానర్ సినిమాలను డెలివరీ చేస్తున్న స్టార్. అయితే ఈ స్టార్ హీరోలిద్దరూ ఒకే టైమ్లో బాక్సాఫీస్ దగ్గర ఢీ కొనబోతున్నారు. ఈ నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య జరగబోయే వార్ మీద బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ రియాక్టయ్యారు.
ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ రాజాసాబ్ సినిమా… రణ్ వీర్ సింగ్ దురంధర్ సినిమా ఒకేరోజున విడుదల కావడంపై రియాక్టయ్యాడు సంజయ్ దత్. తన లెటెస్ట్ ఫిల్మ్… కేడీ – ద డెవిల్ సినిమా ప్రమోషన్లో ఉన్న సంజయ్ దత్ దీనిపై ఆసక్తకర కామెంట్స్ చేశారు. రాజాసాబ్ సినిమాలో తాను రెండు డిఫరెంట్ రోల్స్ చేశానని చెప్పిన సంజయ్ దత్, రాజాసాబ్ , దురంధర్ మూవీలు వేటికవే డిఫరెండ్ సినిమాలన్నారని కామెంట్ చేశారు. నిజానికి.. ఈ రెండు మూవీలు.. ఒకే రోజు రిలీజ్ కాకూడదనే తాను కోరుకుంటున్నానని సంజయ్ అన్నారు. ‘ప్రతీ సినిమాకు సపరెట్ జర్నీ ఉంటుంది. ఏదిఏమైనా.. ఈ రెండు సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీకి మంచిది’ అన్నారు దత్. ఇక ప్రభాస్ రాజాసాబ్.. రణ్వీర్ సింగ్ దురంధర్ మూవీస్ ఒకే రోజు రిలీజ్ కావటం.. ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ రెండు, బిగ్ బడ్జెట్ సినిమాలు కావడంతో.. థియేటర్లు ఎవరికి ఎక్కువ దక్కితే వారికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఈ రెండు సినిమాల నిర్మాతలు గట్టిగానే థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు డేట్స్లో రిలీజ్ అయితే, అటు.. ప్రేక్షకులూ రెండు వేర్వేరు రోజుల్లో మంచి సినిమాలు ఎంజాయ్ చేస్తారని, అటు.. థియేటర్స్ ఓనర్స్ కూడా సేఫ్ గా ఉంటారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ రెండు సినిమా వేరే వేరే డేట్స్ రిలీజ్ అయితే బాలీవుడ్కు బెటర్ అనే కామెంట్ వస్తోంది కొంత మంది బీటౌన్ పెద్దల నుంచి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coolie: కూలీ సినిమాపై లోకి ప్రయోగం !! మరో కబాలి కాదు కదా ??
అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్ !! కెరీర్ను నిలబెట్టే ఛాన్స్ మిస్..