ఒక్క ట్వీట్‌తో.. నయన్‌ ఫ్యాన్స్‌కు చెక్‌.. కస్తూరీ అంటే అట్లుంటది మరీ !!

|

Oct 11, 2022 | 9:36 AM

తాజాగా నయనతార కవలలకు తల్లిదండ్రులు అవడంపై కాంట్రవర్సీ మొదలైంది. హీరోయిన్‌ కస్తూరి ట్వీట్‌ దుమారం రేపుతోంది.ఇండియాలో సరోగసి బ్యాన్‌ ఉంది.

తాజాగా నయనతార కవలలకు తల్లిదండ్రులు అవడంపై కాంట్రవర్సీ మొదలైంది. హీరోయిన్‌ కస్తూరి ట్వీట్‌ దుమారం రేపుతోంది.ఇండియాలో సరోగసి బ్యాన్‌ ఉంది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప…సరోగసిని ప్రోత్సహించకూడదు.ఈ నిబంధనలు జనవరి 2022 నుండి అమల్లోకి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం అంటూ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశం అయింది. అయితే ఈ ట్వీట్‌ ఎవరిని ఉద్దేశించి అన్నది ఎక్కడా కస్తూరి ప్రస్తావించలేదు. అయితే ఈ ట్వీట్ నయన్ దంపతుల గురించే అని ఫిక్సయిన ఫ్యాన్స్ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టారు. పక్కన వాళ్ల గురించి పట్టించుకోవడం మానేసి.. తన పని తాను చూసుకోవాలని హితబోధ చేశారు. నీ పని నవ్వు చేసుకోమ్మా తల్లి అంటూ.. ఫన్నీ మీమ్స్ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Nayanthara: తల్లి అవడం ఏమో కాని.. పెద్ద రచ్చకు కేరాఫ్‌ అయింది

Follow us on