Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

Updated on: Feb 01, 2026 | 4:52 PM

మన శంకర వర ప్రసాదు కేవలం 18 రోజుల్లో ₹358 కోట్లు వసూలు చేసి పుష్ప రికార్డును బద్దలు కొట్టారు. తన తాజా సినిమా విజయం తర్వాత మెగాస్టార్, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. దావోస్ పర్యటన యాదృచ్ఛికమే అన్నారు. తనకు సాధ్యంకాని రాజకీయ సామర్థ్యం తన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు ఉందని మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మన శంకర వర ప్రసాదు ఇప్పుడు రికార్డులకు మళ్లీ కేరాఫ్‌ గా మారిపోయారు. వింటేజ్ వైబ్‌ను తీసుకురావడమే కాదు.. తన వింటేజ్‌ జోరును కూడా నయా తరానికి తెలిసేలా చేస్తున్నారు. ఈక్రమంలోనే ఏకంగా పుష్ప రికార్డ్‌ను బద్దలు కొట్టారు మన వర ప్రసాదు. పాన్ ఇండియా లెవల్లో వచ్చిన పుష్ప సినిమా.. ఓవరాల్ గా రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది.అదే మన శంకర వర ప్రసాదు కేవలం 18 రోజుల్లోనే రూ.358 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తన విశ్వరూపం తడాఖా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపించారు. మన శంకర వర ప్రసాదు గారు సినిమా తర్వాత ఫుల్ జోష్‌ మీదున్న మెగాస్టార్.. రీసెంట్‌గా కొంత మంది సీనిరియస్ ఫిల్మ్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే మరోసారి తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని మరో సారి స్పష్టం చేశారు. ఇటీవల తాను దావోస్ వెళ్లడం యాదృచ్ఛికంగా జరిగిందన్న చిరు.. తనకు అన్ని పార్టీల నేతలు మిత్రులే అంటూ చెప్పుకొచ్చారు. సినిమా, రాజకీయం రెండు రంగాలను నెట్టుకురావడం తనకు సాధ్యం కాలేదని.. కానీ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఆ సమర్థత ఉందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు చిరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??

Vijay Deverakonda: నితిన్ బ్యాడ్‌ లక్.. విజయ్‌ గుడ్ లక్

TOP 5 ET: చిరు సంచలన నిర్ణయం..మనోడితోనే మొదలు

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్