Chiranjeevi: ఏదో పొరపాటున చెబితే.. నాకు క్యాన్సర్ అంటూ ప్రచారం చేశారు
మెగాస్టార్ చిరంజీవి తనకు క్యాన్సర్ వచ్చిందనే వార్తలపై స్పష్టతనిచ్చారు. ముందు జాగ్రత్తగా పాలిప్స్ తొలగించుకున్నానని, అవి క్యాన్సర్ కాదని తెలిపారు. అబద్ధపు ప్రచారంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. తన స్నేహితుడి క్యాన్సర్ అనుభవాన్ని ఉదహరిస్తూ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందని ఇటీవల జరిగిన ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను రెగ్యులర్ చెకప్స్లో భాగంగా పాలిప్స్ తొలగించుకున్నానని, అవి క్యాన్సర్ కారకమైనవి కావని, కేవలం ముందు జాగ్రత్త చర్యగానే తొలగించారని వివరించారు. ఈ విషయాన్ని ఒక జర్నలిస్టు తప్పుగా అర్థం చేసుకొని, తనకు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం చేశారని చిరంజీవి పేర్కొన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదని చిరంజీవి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నామనే భావనతో పరీక్షలు చేయించుకోకపోవడం ప్రమాదకరమన్నారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ఎవరికి ఎలా వస్తాయో తెలియదని, జెనెటికల్ కారణాలు కూడా ఉండవచ్చని చెప్పారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్లిమిడెడ్ బాగోతం
కుళ్ళిన మాంసంతో నూనె దందా.. ఎవరా ముఠా
CM Revanth Reddy: KCR లా మాట ఇచ్చి తప్పడాలు ఉండవు.. గుళ్లను అభివృద్ధి చేస్తాం
CM Chandra Babu: మీరు తప్పు చేసి మమ్మల్ని క్షమాపణ చెప్పమంటారు ఏంటి?
