దీపావళికి క్యూ కట్టిన సౌత్ సినిమాలు.. బిజీ బిజీగా బాక్సాఫీస్‌

Updated on: Oct 10, 2025 | 10:07 PM

దసరా పండుగ తర్వాత దీపావళి సీజన్‌కు సౌత్ ఇండియన్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల నుంచి పలు క్రేజీ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, ప్రదీప్ రంగనాథన్, మోహన్ లాల్ వంటి తారల సినిమాలు విడుదల కానున్నాయి. ఈసారి దీపావళి పోటీ గట్టిగా ఉండబోతోంది.

దసరా సందడి ముగియడంతో ఇప్పుడు సినీ ప్రియుల దృష్టి దీపావళి పండుగపై పడింది. దసరా సినిమాలు రెండు మూడు వారాలు కొనసాగడంతో, దీపావళి తేదీలకు భారీ రద్దీ కనిపిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలతో సంబంధం లేకుండా ఈసారి దీపావళి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. సాధారణంగా తెలుగులో దీపావళికి పెద్దగా సందడి ఉండదు. అయితే ఈసారి పలు క్రేజీ సినిమాలు రేసులోకి వచ్చాయి. అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం నటించిన కే రామ్ విడుదల కానుంది. దీనికి ముందు రోజు సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ చిత్రంతో రానున్నారు. బన్నీ వాస్ టీం నుండి వస్తున్న ‘మిత్రమండలి’ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్ అవుతున్న మెగాస్టార్‌ నయా లుక్.. ఫ్యాన్స్‌కు పండగేనా

మాట మార్చిన మహేష్‌.. గ్లోబల్ మూవీలో మాస్ నెంబర్‌కు రెడీ అవుతున్న సూపర్ స్టార్

కర్ణాటక Vs రష్మిక.. ఈ వివాదానికి ముగింపే లేదా

వెండితెరకు ముప్పు.. ఓటీటీల పెత్తనానికి చెక్‌ పెట్టేదెవరు

ట్రంప్‌కు అమెరికా సెనేటర్ల లేఖ.. భారత్‌తో బంధం పెంచుకోవాలని సూచన