సెంచరీ స్టార్స్‌… సౌత్‌లో క్రేజీ కెప్టెన్స్‌

Updated on: Sep 29, 2025 | 6:20 PM

ప్రస్తుతం 100 కోట్ల మార్కు సాధించడం టాలీవుడ్‌లో సాధారణమైనప్పటికీ, వరుసగా ఈ ఘనత సాధించడం అరుదు. సుజిత్, రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలను కొడుతూ బాక్స్ ఆఫీస్‌ను శాసిస్తున్నారు. ఈ అరుదైన ఫీట్‌ను సులభంగా సాధిస్తున్న సినీ దిగ్గజాలపై కథనం.

టాలీవుడ్ స్క్రీన్ మీద 100 కోట్ల మార్క్ చిన్నదిగా కనిపిస్తున్నా, వరుసగా 100 కోట్ల వసూళ్లు సాధించే సినిమా చేయడం అంత సులభం కాదు. సరైన కథ, స్టార్ కాస్ట్, అంతకు మించిన క్రేజ్ ఉంటేనే ఈ ఫీట్‌ను సాధించగలరు. అలాంటి అరుదైన ఘనతను కొంతమంది దర్శకులు అవలీలగా సాధిస్తున్నారు. తాజాగా, పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ సినిమా తొలి రోజే 100 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమాతో దర్శకుడు సుజిత్ రెండోసారి 100 కోట్ల క్లబ్‌లో చేరారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలితో తొలిసారి 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి, ఆ తర్వాత బాహుబలి 2, ట్రిపుల్ ఆర్ సినిమాలను ఏకంగా 1000 కోట్ల క్లబ్‌లో నిలబెట్టి యువ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాహుబలి కథ నుంచి క్యూ కడుతున్న ప్రీక్వెల్స్‌

రామ్ చరణ్ 18 ఏళ్ల ప్రస్థానం.. పెద్ది అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం

గ్లామర్ టర్న్‌.. నార్త్ డెబ్యూకి నయా ఫార్ములా

రూటు మారుస్తున్న యంగ్ హీరోలు.. మరి ఫేటు మారుతుందా

ఆసియాకప్ ట్రోఫీని, మెడల్స్ ను తీసుకెళ్లిన నక్వీ