జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

Updated on: May 24, 2026 | 2:25 PM

శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ దక్షిణాదిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే దేవరతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ నటి, ధృవ్ విక్రమ్ సరసన కోలీవుడ్ డెబ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సౌత్ సినిమాలపై ఆమె ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.

శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్, దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసినప్పటికీ, సౌత్ ఎంట్రీపై ఆమె ఆసక్తి చూపారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంతో అడుగుపెట్టిన జాన్వీ, ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ చరణ్‌కు జోడీగా ఒక పెద్ద సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం కోలీవుడ్ నుండి ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయి. జాన్వీ కూడా బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాలతో కలిసి పనిచేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యంగ్ హీరో ధృవ్ విక్రమ్ సరసన తెరకెక్కుతున్న చిత్రంతో జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us