ప్రొడ్యూసర్‌ను చూస్తుంటే బాధేస్తోంది.. అడుగేస్తే అడ్డంకులే

Updated on: Feb 03, 2026 | 9:36 AM

జన నాయగన్ సినిమా సెన్సార్ వివాదం కొనసాగుతోంది. కోర్టు తీర్పుతో చిత్రం మరోసారి సెన్సార్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై హీరో విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు, సినిమాలు చేయనని, నిర్మాతలను చూస్తే బాధగా ఉందని తెలిపారు. దీంతో విజయ్ మరో సినిమా చేస్తారని లేదా సెన్సార్ బోర్డుపై పోరాడతారని కోలీవుడ్లో చర్చ జరుగుతోంది.

జన నాయగన్ – సెన్సార్ బోర్డ్‌ మధ్య ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్‌ కోర్టు తీర్పుతో.. జన నాయగన్ సినిమా మరోసారి సెన్సార్ కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దీంతో సెన్సార్ సూచించిన అభ్యంతరాలను తొలగిస్తేనే విడుదల సాధ్యం అయ్యే పరిస్థితి. ఈ క్రమంలోనే ఈ ఇష్యూపై హీరో విజయ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక నుంచి తాను సినిమాలు చేయనని నిర్ణయం తీసుకున్నానని.. కానీ, జన నాయగన్ సినిమా విషయంలో తన నిర్మాతలను చూస్తుంటే మాత్రం బాధగా ఉందంటూ చెప్పాడు. దీంతో జన నాయగన్ ప్రొడ్యూసర్స్‌ ఆదుకునేందుకు విజయ్‌ మరో సినిమా చేస్తాడనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఇక మరి కొందరేమో.. సెన్సార్‌ బోర్డ్‌కు వ్యతిరేకంగా దళపతి పోరు బాట పట్టనున్నారని చెబుతున్నారు. విజయ్‌ కామెంట్స్‌ను పలు కోణాల్లో విశ్లేషిస్తూ.. రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తెలుగు రాష్ట్రాలను చుట్టుముడుతున్న పులుల

CM Revanth Reddy: KCRకు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా

Loading...
Unable to load recommendations.
Follow Us