Sai Durgha Tej: రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

|

Oct 26, 2024 | 12:32 PM

ఓ పక్క బాబాబాయ్‌ ఏపీ పాలిటిక్స్లో.. దూసుకుపోతున్న వేళ.. మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్ రాజ‌కీయాల్లోకి రావ‌డంపై తాజాగా ఆస‌క్త‌కిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత రోజుల్లో రాజ‌కీయాల్లోకి రావ‌డం అంత ఈజీ కాద‌న్నారు. ఎన్నో విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌న దృష్టంతా సినిమాల‌పైనే అని స్ప‌ష్టం చేశారు.

సుప్రీం హీరో.. మెగా మేన‌ల్లుడు సాయి దుర్గ తేజ్ రాజ‌కీయాల్లోకి రావ‌డంపై తాజాగా ఆస‌క్త‌కిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రాలో మామయ్య డిప్యూటీ సీఎం గా ఏపీ పాలిటిక్స్లో దూసుకుపోతున్న తరుణంలో ప్ర‌స్తుత రోజుల్లో రాజ‌కీయాల్లోకి రావ‌డం అంత ఈజీ కాద‌న్నారు. ఎన్నో విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని తెలిపారు. ఇక ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తానంటూ మరో సారి చెప్పారు సాయి దుర్గ తేజ్‌. పాలిటిక్స్‌లో రావాల‌నే ఆలోచ‌న ప్ర‌స్తుతం త‌న‌కు లేద‌న్నారు. రాజ‌కీయాల్లోకి రావాలంటే ముఖ్యంగా ప్ర‌జా స‌మస్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని తెలిపారు. అలాగే ఎన్నో విష‌యాలు నేర్చుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఇక ప్రస్తుతం సాయి దుర్గ తేజ్.. పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఎస్డిటీ-18 వర్కింగ్ టైటిల్‌తో ఈసినిమా షూటింగ్‌ను పరిగెత్తిస్తున్నాడు. అంతేకాదు అక్టోబర్ 15న తేజు బర్త్‌ డే సందర్బంగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ బయటికి వచ్చింది. అది కాస్తా తేజు ఫ్యాన్స్ను ఖుషీ అయ్యేలా చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on