Chiranjeevi: డీప్‌ ఫేక్‌ వీడియోలపై చిరంజీవి స్పందన

Updated on: Oct 31, 2025 | 4:34 PM

నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి. రన్ ఫర్ యూనిటీ పేరుతో జరిపిన రన్‌లో పాల్గొన్న ఆయన.. 560 సంస్థానాలను ఒక్కటి చేసి.. దేశాన్నంతా ఏకం చేసిన సర్దార్ పటేల్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. పటేల్ నేటి తరానికి స్పూర్తి అని.. ఏం జరిగినా ఐక్యంగా ఉండాలన్న సర్దార్ సంకల్పం గొప్పదన్నారు చిరంజీవి.

డీప్‌ ఫేక్‌ వీడియోలపై చిరంజీవి స్పందించారు. టెక్నాలజీని ఆహ్వానించాలి కానీ.. దానివల్ల ముప్పు కూడా ఉందన్నారు. డీప్‌ఫేక్‌పై ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని, లేకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు. డీప్‌ ఫేక్‌ వీడియోలపై ఇప్పటికే తాను ఫిర్యాదు చేశానని, దానిపై స్వయంగా సీపీ సజ్జనార్‌ కేసును పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డీప్‌ ఫేక్‌, సైబర్‌ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన మన పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో.. బంగారం ధర మళ్లీ పెరిగిందిగా.. ఎంతంటే

పెళ్లి పేరుతో వ్యాపారాలా ?? తీవ్ర ఆగ్రహం

ఆన్‌లైన్‌లో హీట్ పెంచుతున్న బ్యూటీస్‌

Baahubali The Epic: బాహుబలి ది ఎపిక్‌ రివ్యూ ఇచ్చిన గౌతమ్‌

Toxic: టాక్సిక్‌ వాయిదా న్యూస్‌పై నిర్మాతలేమంటున్నారు ??