Anushka: అనుష్క ఇలా షాక్ ఇచ్చిందేంటి.. ఇక గుడ్ బై

Updated on: Sep 14, 2025 | 4:35 PM

అనుష్క శెట్టి తన తాజా చిత్రం "ఘాటి" బాక్సాఫీస్ వద్ద విఫలం చెందడంతో సోషల్ మీడియా నుండి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడకపోవడంతో అనుష్కపై ఒత్తిడి పెరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆమె తన భావోద్వేగ పోస్ట్ లో త్వరలోనే కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

టాలీవుడ్ నటి అనుష్క శెట్టి తాజా చిత్రం “ఘాటి” బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గంజాయి మాఫియా నేపథ్యంతో తెరకెక్కింది. చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే థియేటర్ల నుండి తొలగించారు. సినిమా విఫలం తర్వాత అనుష్క తన ఫేస్బుక్ ఖాతాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టి, కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించింది. ఈ విరామం ఆమెకు సెల్ఫ్ హీలింగ్ సమయంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆమె త్వరలోనే కొత్త చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఆమె పోస్ట్ సూచిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దసరాకు దిమ్మతిరిగే న్యూస్.. తండ్రీ కొడుకుల పాన్ ఇండియా ఫిల్మ్

రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

వామ్మో.. ఎంతకు తెగించార్రా? కదులుతున్న లారీపై చోరీ.. వస్తువులు కింద పడేస్తూ

Haryana: కోర్టుకి ఆలస్యంగా వచ్చిన ఇన్‌స్పెక్టర్‌.. జడ్జి ఏం చేశారో తెలుసా

Congo Boat Accidents: ఊహించని విషాదం.. 193 మంది జలసమాధి..! పెను విషాదం

Loading...
Unable to load recommendations.
Follow Us