లెక్కలేసి మరీ పడుతున్న అల్లు అర్జున్

Updated on: Feb 04, 2026 | 8:20 PM

అల్లు అర్జున్ దర్శకుల ఎంపికలో ఓ ప్రత్యేక ఫార్ములాను పాటిస్తున్నారు. ప్రముఖ దర్శకుల పనితీరును బహిరంగంగా ప్రశంసించి, ఆ తర్వాత వారితో సినిమా ఖరారు చేసుకుంటున్నారు. అట్లీ, సందీప్ వంగా విషయంలో ఇదే జరిగింది. తాజాగా దురందర్ దర్శకుడు ఆదిత్య ధర్ విషయంలోనూ ఇలాంటిదే ఊహాగానాలున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకులను ఎంపిక చేసుకోవడంలో ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆయన సోషల్ మీడియా పోస్టులను, వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తే, తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఏ దర్శకుడితో చేయబోతున్నారో సులభంగా అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా బన్నీ ఇదే ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. అలా వైకుంఠాపురంలో, పుష్ప పార్ట్ వన్ మధ్య రెండేళ్ల గ్యాప్, అలాగే పుష్ప 2 కోసం మూడేళ్లు తీసుకున్న తర్వాత, అల్లు అర్జున్ తన కెరీర్‌లో వేగం పెంచారు. ఇప్పుడు ఆయన తమిళ, హిందీ సినీ పరిశ్రమల నుంచి దర్శకులను తెలివిగా ఎంపిక చేసుకుంటున్నారు. జవాన్ విడుదలకు ముందు దర్శకుడు అట్లీ పనితీరును బన్నీ ప్రశంసించారు. ఆ వెంటనే అట్లీతో సినిమా ఖరారైంది. అలాగే, యానిమల్ సమయంలో సందీప్ వంగా పనిని అభినందించి, ఆయనతో ప్రాజెక్ట్‌ను లాక్ చేసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

Published on: Feb 04, 2026 08:10 PM