Shriya Saran: శ్రీవారి సేవలో శ్రియ శరణ్.. ప్రత్యేక పూజలు చేయించుకున్న ముద్దుగుమ్మ

Edited By:

Updated on: Feb 19, 2026 | 12:10 PM

నటి శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తోమాల సేవలో పాల్గొన్నారు. భక్తులు ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అనంతరం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించిన 43 ఏళ్ల శ్రియ ఆధ్యాత్మిక యాత్ర అందరి దృష్టిని ఆకర్షించింది. రెండు పుణ్యక్షేత్రాల్లోనూ ఆమె వేద ఆశీర్వచనం అందుకున్నారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నటి శ్రియ శరణ్. తెలుగు తమిళం హిందీ తో పాటు పలు భాషల సినిమాల్లో నటించిన 43 ఏళ్ల శ్రియ తిరుమల వెంకన్న సన్నిధిలో సందడిగా మారారు. శ్రీ వెంకటేశ్వర స్వామి తోమాల సేవలో పాల్గొన్న శ్రియ ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం పొందారు. శ్రీవారి ఆలయంలోని క్యూ లైన్ లో ఉన్న భక్తులతో పాటు ఆలయం బయటకు శ్రియను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అనంతరం శ్రియ శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకున్న శ్రియ కు అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

వారికి ఆ రైళ్లల్లో ఎమర్జెన్సీ కోటా.. బెర్త్ పొందడం ఎలా ??

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

Follow Us