AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నారాయణగూడలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. తనిఖీ చేయగా..

Hyderabad: నారాయణగూడలో అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. తనిఖీ చేయగా..

Ram Naramaneni
|

Updated on: Sep 09, 2025 | 11:03 AM

Share

నారాయణగూడలో పోలీసులు రద్దయిన 500, 1000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ నలుగురిని అదుపులోకి తీసుకుని, రెండు కోట్ల రూపాయలకు పైగా విలువైన నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. నోట్ల మూలం గురించి విచారణ జరుగుతోంది.

హైదరాబాద్‌లోని నారాయణగూడలో పోలీసులు భారీగా రద్దు చేసిన నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నారాయణగూడ శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న కెనరా బ్యాంకు దగ్గర ఇద్దరిని, వాటర్ వర్క్స్ కార్యాలయం దగ్గర మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నెహ్రునగర్ దగ్గర మూడు బ్యాగులను తనిఖీ చేయగా, అందులో 500, 1000 రూపాయల నోట్లు ఉన్నట్లు గుర్తించారు. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న నోట్ల మొత్తం విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. పట్టుబడిన నలుగురినీ నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి, నోట్ల మూలం గురించి విచారణ కొనసాగుతోంది.

Published on: Sep 09, 2025 11:03 AM