దసరా ఉత్సవాల్లో ‘పుత్తడి అమ్మ’ ఆల్ టైమ్ రికార్డులు

Updated on: Sep 30, 2025 | 10:24 PM

దసరా ఉత్సవాల్లో అమ్మవారికి బంగారు అలంకరణలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ నుండి భీమవరం మావుళ్ళమ్మ వరకు, అలాగే విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి ఆలయంలో లక్షల కోట్ల విలువైన ఆభరణాలు, కరెన్సీ నోట్లతో దేవతలను అలంకరించారు. పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నా భక్తులు ఎక్కడా రాజీ పడకుండా అమ్మవారికి స్వర్ణకాంతులతో దివ్య దర్శనం కల్పించారు.

దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అలంకరణలు ఈసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. పసిడి ధరలు ఎంతగా పెరుగుతున్నప్పటికీ, భక్తులు తమ ఆరాధ్య దేవతలకు బంగారు ఆభరణాలతో వైభవోపేతమైన అలంకరణలు చేయడం విశేషం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వివిధ అవతారాల్లో స్వర్ణమయంగా దర్శనమిచ్చారు. కోల్‌కతా, కటక్‌లలో బంగారు మండపాలు, 12 కిలోల స్వర్ణ కిరీటాలు ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hyderabadలో ప్రపంచ ముద్దుగుమ్మల సందడి అనాధ పిల్లల సేవలో సుందరాంగులు

ప్రసాద్‌ ల్యాబ్‌లో OG స్పెషల్ షో కుటుంబంతో కలిసి చూసిన పవన్

AP Rains: ఆంధ్రాకు భారీ వర్ష సూచన.. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

అమెరికా అధ్యక్ష భవనం ఇక బంగారుమయం