రైలు పట్టాలపై మూడు ప్రాణాలు.. తల్లి పిలుపుతో మృత్యుఒడిలోకి.. అసలేం జరిగింది

Updated on: Feb 07, 2026 | 7:04 PM

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలు విశాల్, చేతనతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన వెనుక అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు FSL నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన పిల్లలు విశాల్, చేతనలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. జనవరి 30న హాస్టల్ నుండి పిల్లలను తీసుకెళ్లిన విజయశాంతి, కారులో చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రాత్రంతా స్టేషన్‌లో గడిపిన తర్వాత, ఘట్‌కేసర్ సమీపంలో ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగి వారం రోజులు గడిచినా, ఈ తీవ్ర నిర్ణయం వెనుక అసలు కారణాలు మాత్రం అంతుచిక్కడం లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్వాంటం వ్యాలీ కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం

మద్యం మత్తులో మాస్ ఫైట్! బార్ బయట వీరంగం.. అసలేం జరిగిందంటే..

గ్రూప్-2 విజేతగా నిలిచిన అంధ యువకుడు

అమ్మవారి ఆలయం కూల్చివేత.. అటవీశాఖ తీరుపై జనం ఆగ్రహం

అధికారం ఉందని అతి చేయకూడదు.. వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని