Vijayawada: మద్యం మత్తులో రౌడీషీటర్లు.. జనాలపైకి దూసుకెళ్లిన కారు

Updated on: Jan 12, 2026 | 5:43 PM

విజయవాడ భవానీపురంలో మద్యం మత్తులో ఉన్న రౌడీషీటర్లు కారుతో బీభత్సం సృష్టించారు. జనాలపైకి దూసుకెళ్ళిన కారుతో ఐదుగురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఆ కారును నడిపారు.

విజయవాడలోని భవానీపురం ప్రాంతంలో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు రౌడీషీటర్లు ఆ కారును నడిపారు. బబ్బూరి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కారుతో స్టంట్స్ చేస్తూ, జనంపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటనకు కారణమైన రౌడీషీటర్లు చిన్న చిచ్చా, పెద్ద చిచ్చాగా గుర్తించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో చిన్న చిచ్చాపై 39 కేసులు, పెద్ద చిచ్చాపై 21 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ప్రతి వారం భవానీపురం పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు వెళ్తున్నప్పటికీ, వారి ప్రవర్తనలో మార్పు రాలేదని స్పష్టమైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: ఫ్రెడరిక్ మెర్జ్ తో కలిసి కైట్ ఫెస్టివల్‌ లో పాల్గొన్న ప్రధాని మోదీ

Trump: నేనే వెనిజులా అధ్యక్షుడినంటూ ట్రంప్‌ పోస్ట్‌

10 వేల అడుగులా.. 45 నిమిషాల వ్యాయామమా.. ఫిట్‌నెస్‌ కోసం ఏది బెస్ట్‌ ??

చంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలో అద్భుత దృశ్యం

ఉదయాన్నే పొలానికి వెళ్తున్న రైతులు.. దారిలో సీన్‌ చూసి పరుగులు