క్షణక్షణం నరకం! క్షిపణుల మధ్య భారత నావికులు..

Updated on: Mar 15, 2026 | 9:10 PM

అమెరికాతో ఇరాన్ యుద్ధ వాతావరణంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత ఎల్‌పీజీ ట్యాంకర్ నావికుల భయంకర పరిస్థితులు. క్షిపణులు, డ్రోన్ల మధ్య బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నామని కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ ఆవేదన. భారత నౌకాదళం రక్షణగా వచ్చి స్వదేశానికి తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన మధ్య త్వరలో గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ఆశాభావం.

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిలో ఒక భారతీయ ఎల్‌పీజీ ట్యాంకర్ చిక్కుకుపోయింది. ముంబైకి చెందిన ఈ నౌక, కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, 30 మంది సిబ్బందితో మార్చి 2వ తేదీ నుంచి యూఏఈలోని మీనా సకర్ పోర్ట్ వద్ద నిలిచిపోయింది. చుట్టూ క్షిపణి దాడులు, డ్రోన్ల నిరంతర సంచారం, సైరన్‌ల మోత మధ్య తాము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నామని కెప్టెన్ వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ వద్ద 60 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, భారత నౌకాదళం వచ్చి సురక్షితంగా తమను స్వదేశానికి చేర్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెప్టెన్ భార్య నిల్పా విశ్వకర్మ తన భర్త, సిబ్బంది క్షేమం కోసం ప్రార్థిస్తూ ఆందోళన చెందుతున్నారు. భారత్‌తో స్నేహ సంబంధాల కారణంగా ఇరాన్ ఇప్పటికే రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లకు హార్ముజ్ జలసంధిని దాటేందుకు అనుమతించింది. ఇదే తరహాలో కెప్టెన్ వీరేంద్ర ప్రయాణిస్తున్న నౌకకు కూడా త్వరలో అనుమతి లభిస్తుందని అధికారులు ఆశిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gas Shortage: గ్యాస్ కొరతపై కేంద్రం మరో కీలక అప్డేట్..

Drug Party Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు

పోలీసుల అత్యుత్సాహంతో యువకుడి మృతి

Rashmika: రష్మిక మాస్ వార్నింగ్.. అలాంటి తప్పులు చేస్తే కట్టిన చర్యలు తప్పవు

Ustaad Bhagat Singh: పీక్స్‌కు చేరిన ఉస్తాద్ మ్యానియా! అంచనాలు భారీగా పెంచుతున్న మేకర్స్

Loading...
Unable to load recommendations.
Follow Us