15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్‌ !! ఎందుకిలా ?? వీడియో

|

Jan 03, 2022 | 8:19 AM

ఓవైపు యూరోప్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ భయాలు.. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలు సోమవారం స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాల ప్రతికూల సంకేతాలు మార్కెట్లను మరింత దెబ్బకొట్టాయి.

ఓవైపు యూరోప్‌ దేశాల్లో ఒమిక్రాన్‌ భయాలు.. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాలు సోమవారం స్టాక్‌మార్కెట్‌ను కుదిపేశాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాల ప్రతికూల సంకేతాలు మార్కెట్లను మరింత దెబ్బకొట్టాయి. దీంతో సూచీలు సోమవారం నాటి ట్రేడింగ్‌ను భారీ నష్టాలతో ప్రారంభించాయి. సెన్సెక్స్‌ ఏకంగా 1300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ 16,600 పాయింట్లకు దిగువన ట్రేడ్‌ అయింది. ట్రేడింగ్‌ ఆరంభంలోనే మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో కేవలం 15 నిమిషాల్లో వ్యవధిలో 5.2లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో బీఎసీఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.5.19లక్షల కోట్లు తగ్గి రూ.254.08లక్షల కోట్లకు పడిపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇది తాగితే.. వృద్ధాప్య సమస్యలకు చెక్‌ పడినట్లే !! వీడియో

News Watch: వీళ్లు తాగుతున్నది మద్యం కాదు… ఆడవాళ్ల రక్తం… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

Follow us on