Economic Survey 2026: దేశం 20 ఏళ్ల వెనక్కెళ్తుందా ?? ఆర్థిక సర్వేలో షాకింగ్ నిజాలు

Updated on: Jan 30, 2026 | 6:48 PM

ఆర్థిక సర్వే 2026 భారత ఆర్థిక వ్యవస్థపై ఆశాజనక అంచనాలతో పాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. జీడీపీ వృద్ధి స్థిరంగా ఉన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు, 2008 నాటి ఆర్థిక సంక్షోభ పునరావృత్తి వంటి ప్రమాదాలను గుర్తించింది. బంగారం ధరల పెరుగుదలపై కూడా నివేదిక సూచనలు చేసింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు, ఇందులో జీడీపీ 6.8% నుంచి 7.2%కి పెరుగుతుందని, ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని, వస్తువుల ధరలు స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఈ సానుకూల చిత్రంతో పాటు తీవ్రమైన హెచ్చరికలు కూడా ఉన్నాయి. ఆర్థిక సర్వే ప్రకారం, సాంకేతిక రంగంలో వేగవంతమైన మార్పులు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విస్తరణ వల్ల ఐటీ ఉద్యోగాలకు ప్రత్యక్ష ముప్పు తప్పదు. ఇది దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టే ప్రమాదం ఉందని, 2008 నాటి ఆర్థిక సంక్షోభం పునరావృతమయ్యే అవకాశం ఉందని నివేదిక సూచిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కలచివేస్తున్న నాంపల్లి అగ్నిప్రమాద బాధితుల ఆఖరి ఆడియో

Harish Rao: ఢిల్లీ మీటింగ్‌ను బహిష్కరించండి.. హరీష్ రావు డిమాండ్

KCR: సిట్ నోటీసుల వేళ.. పొలం బాట పట్టిన కేసీఆర్

కెప్టెన్‌ కుర్చీలో అందాల తారలు.. కథలు చెబుతామంటున్న హీరోయిన్లు

Salaar 2: సలార్‌ సీక్వెల్‌లో కదలిక.. అంతా శృతి వల్లనే అంటున్న డార్లింగ్‌ ఫ్యాన్స్

Loading...
Unable to load recommendations.
Follow Us