ప్రధాని మోదీకి నారీ’శక్తి’ అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటరిచ్చిన బీజేపీ..

|

Mar 19, 2024 | 3:32 PM

దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె 'శక్తి'కి స్వరూపమేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో 'శక్తి'ని నాశనం చేసేందుకే తమ పోరాటామంటూ ఇండియా కూటమి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా.. నారీశక్తిని బలోపేతం చేసేందుకు..

దేశంలోని ప్రతి తల్లి, ప్రతి కుమార్తె ‘శక్తి’కి స్వరూపమేనంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ‘శక్తి’ని నాశనం చేసేందుకే తమ పోరాటామంటూ ఇండియా కూటమి సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా.. నారీశక్తిని బలోపేతం చేసేందుకు తమ పార్టీ ముందు ఉంటుందని.. తాను ప్రతీ తల్లి, ప్రతీ కుమార్తెను కాపాడుకునేందుకు ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తూ.. నారీశక్తిపై ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసుకుంది బీజేపీ. టార్గెట్ 400 అంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం ప్రధాని మోదీ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఇటీవల సేలం జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో.. 11 మంది మహిళలు అపరశక్తులుగా మారి.. ప్రధాని మోదీకి సాదర స్వాగతాన్ని పలికారు. ఒకవైపు దేశంలో మహిళలపై దాడులు జరుగుతుండగా.. మరోవైపు నారీశక్తిపై తమకున్న గౌరవాన్ని వినూత్న రీతిలో ఈ విధంగా చూపిస్తోంది బీజేపీ.

Follow us on