Sabarimala Makara Jyothi: మకరజ్యోతి దర్శనం.. అయ్యప్ప నామస్మరణతో పరవశిస్తున్న భక్తుల హృదయాలు.. లైవ్ వీడియో..

|

Jan 15, 2024 | 5:21 PM

శబరిగిరులు శరణుఘోషతో పులకిస్తున్నాయి. అయ్యప్ప నామస్మరణతో భక్తుల హృదయాలు పరవశిస్తున్నాయి. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు భక్తులు. పంబలో స్నానం చేసి..సన్నిధానం చేరుకుని.. మణికంఠుని దర్శనం కోసం..మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురుచూస్తున్నారు. పందళరాజ వంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకు బయలుదేరుతారు.

శబరిగిరులు శరణుఘోషతో పులకిస్తున్నాయి. అయ్యప్ప నామస్మరణతో భక్తుల హృదయాలు పరవశిస్తున్నాయి. మండలకాలం పాటు దీక్ష చేసి.. ఇరుముడి కట్టుకుని.. శబరిమలకు చేరుకున్నారు భక్తులు. పంబలో స్నానం చేసి..సన్నిధానం చేరుకుని.. మణికంఠుని దర్శనం కోసం..మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురుచూస్తున్నారు. పందళరాజ వంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకు బయలుదేరుతారు. వలియకొయిక్కల్‌ శ్రీధర్మశాస్త ఆలయం నుంచి 12 మంది పందళరాజ వంశీయులు తిరువాభరణాలతో కూడిన మూడు పెట్టెలను శిరస్సున ధరించి.. వడివడిగా అడుగులు వేసుకుంటూ.. సన్నిధానం వైపు కదులుతున్నారు. మూడురోజుల ఈ తిరువాభరణం ఊరేగింపు యాత్రను 15మంది సభ్యుల ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బృందం కోఆర్డినేట్‌ చేస్తోంది.

ఈ సాయంత్రం తిరువాభరణాలతో పందళరాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన తంత్రి వారికి స్వాగతం పలికి..వారు తెచ్చిన బంగారు ఆభరణాలను అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం పొన్నాంబలమేడు నుంచి మకరజ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివితీరా దర్శించి..ఇరుముడి సమర్పించి..ధన్యోహం ఓ శబరీశా అంటూ మాటలకందని ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు స్వాములు.

లక్షలాది భక్తుల ఆశ, శ్వాస అయ్యప్ప! మకరజ్యోతి దర్శనమే వారి దీక్షకు పరమార్థంగా భావిస్తారు. 6.20 పమయంలో మకరజ్యోతి దర్శన భాగ్యం కల్గుతుంది. ఆ దృశ్యాలను టీవీ9లో ప్రత్యక్షప్రసారం చేస్తుంది. ఈసారి శబరిమలకు వెళ్లలేకపోయిన భక్తులందరూ టీవీ9లో మకరజ్యోతిని దర్శించవచ్చు. జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప అంటూ మణికంఠుడి కీర్తించవచ్చు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..