Chittoor: కాలనీలోని ఓ ఇంట్లో ఏదో వింత వాసన.. అనుమానమొచ్చి చెక్ చేయగా

|

Jul 17, 2024 | 8:13 PM

చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. ఆ వివరాలు..

చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణం పరిసరాలలోని పుంగనూరులో రూ. 5 లక్షలు విలువ చేసే 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో నుంచి ఏదో వింత వాసన వస్తుండటంతో.. డౌట్ వచ్చి చుట్టుప్రక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా.. ఆ ఇంట్లో నుంచి 50 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గంజాయిని నిల్వ ఉంచిన నవీన్ ఆహామ్మద్, ఒరిస్సాకు చెందిన మరో ఇద్దరితో పాటు గంజాయి రిటైల్‌గా అమ్మకాలు సాగించే ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ 6గురి నిందితులను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on