ఎన్నాళ్లకెన్నాళ్లకు ! మళ్ళీ అమ్మ ఒడి చేరిన చిన్నారి చంపక్

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వారణాసిలో ఇతర ఆందోళనకారులతో కలిసి నిరసన తెలిపిన యాక్టివిస్టులు ఏక్తా, ఆమె భర్త రవి శేఖర్ లకు బెయిలు లభించింది. డిసెంబరు 19 న వీరిని వారణాసి పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. సుమారు రెండు వారాల అనంతరం వీరికి బెయిలు లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజుల అనంతరం ఈ దంపతుల 14 నెలల పసిపాప చంపక్ (ఆర్య) మళ్ళీ తన తలిదండ్రులను కలుసుకోగలిగింది. తల్లిని చూసి […]

ఎన్నాళ్లకెన్నాళ్లకు ! మళ్ళీ అమ్మ ఒడి చేరిన చిన్నారి చంపక్
Follow us

|

Updated on: Jan 02, 2020 | 11:24 AM

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వారణాసిలో ఇతర ఆందోళనకారులతో కలిసి నిరసన తెలిపిన యాక్టివిస్టులు ఏక్తా, ఆమె భర్త రవి శేఖర్ లకు బెయిలు లభించింది. డిసెంబరు 19 న వీరిని వారణాసి పోలీసులు అరెస్టు చేసి జిల్లా జైలుకు తరలించారు. సుమారు రెండు వారాల అనంతరం వీరికి బెయిలు లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇన్ని రోజుల అనంతరం ఈ దంపతుల 14 నెలల పసిపాప చంపక్ (ఆర్య) మళ్ళీ తన తలిదండ్రులను కలుసుకోగలిగింది. తల్లిని చూసి ఆ పాప బోసినవ్వులు నవ్వుతుండగా ఆ తల్లి మురిసిపోయింది.

ఈ భార్యాభర్తలతో బాటు బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన దాదాపు పన్నెండు మంది విద్యార్థులకు కూడా బెయిలు లభించింది. ఏక్తాను, ఆమె భర్తను జైలునుంచి రిలీజ్ చేయాలంటూ చంపక్ అమ్మమ్మ ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకొని ఓ లేఖను అందజేసిన సంగతి తెలిసిందే.. తల్లి కోసం చంపక్ ఎంతో బెంగ పెట్టుకుని అనారోగ్యం బారిన పడుతోందని ఆమె ఈ లేఖలో పేర్కొంది. బహుశా ప్రధాని మోదీ ఆదేశాలతో వారణాసిలోని జైలు అధికారులు స్పందించి ఈ దంపతులను, కొందరు విద్యార్థులను విడుదల చేసినట్టు తెలుస్తోంది. అటువీరి తరఫు లాయర్లు కూడా బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా-వాయు కాలుష్యంపై ‘ క్లైమేట్ ఎజెండా ‘ పేరిట ఏక్తా దంపతులు ఓ ఎన్జీఓ ను నిర్వహిస్తున్నారు.