వైరల్ వీడియో… సింహాన్ని వెంబడించిన ఇద్దరు… కేసు నమోదు చేసిన అటవీ శాఖ అధికారులు…
జునాగర్ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింహాన్ని ఇద్దరు యువకులు బైక్పై వెంటాడారు. వారు చేసిన పనిని వీడియో తీశారు.
ఎవరైనా సింహాన్ని చూస్తే జడుసుకుంటారు. జూకు వెళ్లినా సింహం బోనుకు కొద్ది దూరంగా ఆగిపోతారు. అయితే ఓ ఇద్దరు ఆకతాయిలు సింహాన్నే వెంబండించారు. తాము చేస్తున్న పనిని వీడియో తీశారు. షేర్ చేశారు. అది కాస్తా వైరల్గా మారడంతో ఇప్పుడు వారు ఊచలు లెక్కపెడుతున్నారు. వారిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే…
గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జునాగర్ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింహాన్ని ఇద్దరు యువకులు బైక్పై వెంటాడారు. వారు చేసిన పనిని వీడియో తీశారు. అయితే, ఆ వీడియో వైరల్గా మారింది. చివరకు అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జునాగర్ జిల్లా అటవీ శాఖ అధికారి దుష్యంత్ ఈ ఘటనపై స్పందించారు. యువకులు సింహాన్ని వెంటాడిన వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఇద్దరిని పట్టుకుని, కేసు కూడా నమోదు చేశామని అన్నారు. త్వరలో కోర్టు ముందు కూడా హాజరు పరుస్తామని తెలిపారు.