నేటి నుంచి డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్
డిగ్రీలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు కాలేజీలు ఎన్నుకునే సౌలభ్యాన్ని కల్పించింది.
తెలంగాణలో విద్యార్థులు డిగ్రీలో ప్రవేశానికి సమయం ఆసన్నమైంది. నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 9 వరకు కాలేజీలు ఎన్నుకునే సౌలభ్యాన్ని కల్పించింది. సెప్టెంబర్ 16 నుంచి సీట్ల కేటాయింపు ఉంటుంది.
దోస్త్ ప్రక్రియలో భాగంగా తెలంగాణ యూనివర్శిటీ పరిధి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో డిగ్రీ అడ్మిషన్లు సోమవారం నుంచి స్టార్టవుతాయని విశ్వవిద్యాలయ సమన్వయకర్త బాలకిషన్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దోస్త్ రిజిస్ట్రేషన్కు స్టూడెంట్ మెబైల్ ఫోన్కు ఆధార్ సంఖ్య అనుసంధానమై ఉండాలన్నారు. ఒకవేళ కాకపోయి ఉంటే హెల్ప్లైన్ సెంటర్లలో బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో స్టూడెంట్స్ బయటకు రాకుండా చరవాణిలో టీఎస్ పోలియో యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే ఛాన్స్ కల్పించామన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే దగ్గర్లోని హెల్ప్లైన్, మీ సేవా సెంటర్లకు వెళ్లాలన్నారు. 9908833969 నంబర్కు సంప్రదించవచ్చని తెలిపారు.
Also Read :
వైఎస్సార్ ఆసరా నగదుపై ఆంక్షలు లేవు, ఉత్తర్వుల్లో తేల్చి చెప్పిన ప్రభుత్వం