
కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన వరుడికి పెళ్లయిన రెండో రోజే ఊహించని షాకిచ్చింది వధువు. దాంతో తాను మోసపోయానని లబోదిబోమంటున్నాడు నవవరుడు.. అత్తాగారింట అడుగుపెట్టిన రెండో రోజే వధువు బిడ్డకు జన్మనిచ్చింది.. నవ వధువు బిడ్డకు జన్మనివ్వడంతో వరుడు కుటుంబం దెబ్బకు షాకయ్యింది.. కాళ్ల పారాణి ఆరకమునుపే ఒక బిడ్డకు జన్మనివ్వడం వరుడి కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్లో జరిగింది.
ఫిబ్రవరి 24వ తేదీన ఓ జంటకు ఎంతో వేడుకగా వివాహం జరిగింది. మరుసటి రోజే నవ వధువు అత్తారింట అడుగు పెట్టింది. ఫిబ్రవరి 26న ఉదయం వరుడి కుటుంబ సభ్యులందరికీ నవ వధువు టీ కూడా కాచి ఇచ్చింది. ఆ రోజు సాయంత్రమే ఆమె తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటే వరుడు, అతని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ యువతికి పురిటినొప్పులు వచ్చాయని, బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యుడు చెప్పడంతో వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
డెలివరీ చేసిన వైద్య సిబ్బంది బిడ్డను తీసుకొచ్చి వారి చేతిలో పెట్టారు. దీంతో ఖంగుతిన్న నవ వరుడు తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమెను భార్యగా స్వీకరించేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై వరుడి సోదరి స్పందిస్తూ.. పెళ్లి సమయంలో వధువు పెద్ద లెహంగా ధరించిందని, దీంతో ఆమె గర్భవతి అన్న అనుమానం రాలేదని చెప్పింది. వధువు విషయంలో తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసింది.
24 तारीख को शादी हुई
25 तारीख सुहागरात की रात दूर रहो वाला ड्रामा
26 को बच्चा पैदा कर दी नई नवेली दुल्हनखुशी का माहौल नही बन पाया 🤭 pic.twitter.com/7cvHkjNIaJ
— Shwetha Shrivastava (@Ssriwastav30) March 2, 2025
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..