ప్రసిద్ధ కట్టడమైన తాజ్మహల్ లోపల గంగా జలంతో అభిషేకం నిర్వహించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఇందుకోసం కావాల్సిన గంగా జలాన్ని వాటర్ బాటిల్లో తెచ్చారు. శ్రావణ మాసం సందర్భంగా అభిషేకం నిర్వహించేందుకు ప్రయత్నించారు. షాజహాన్, ముంతాజ్ మహల్ సమాధులు ఉన్న తాజ్ మహల్లోని నేలమాళిగకు దారితీసే మూసి ఉన్న మెట్లపై ఒక వ్యక్తి గంగా జలాన్ని పోశాడు. ఆ మెట్ల వద్ద ఓం పేరుతో స్టిక్కర్ ఉందని, అందుకే గంగా జలంతో అక్కడ అభిషేకం చేసినట్లు ఆ వ్యక్తులు వాదించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.