Vande Bharat Train: కదులుతున్న వందేభారత్ రైలు ఎక్కేందుకు యత్నించిన టీసీ… చివరికి ఊహించని ట్విస్ట్

గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కదులుతున్న వందేభారత్ ట్రైన్ ఎక్కబోయిన టీసీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ ట్రైన్ ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది.

Vande Bharat Train: కదులుతున్న వందేభారత్ రైలు ఎక్కేందుకు యత్నించిన టీసీ... చివరికి ఊహించని ట్విస్ట్
Vande Bharat

Updated on: Jul 01, 2023 | 5:37 AM

గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వేస్టేషన్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కదులుతున్న వందేభారత్ ట్రైన్ ఎక్కబోయిన టీసీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వెళ్తున్న వందేభారత్ ట్రైన్ ప్లాట్‌ఫాం నుంచి కదులుతోంది. ఆ సమయానికి ఆ రైల్లో విధులు నిర్వహించాల్సిన టీసీ పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ అప్పటికే ఆ ట్రైన్ తలుపులు పాక్షికంగా ముసుకుపోయాయి. రైలు వేగం పుంజుకుంటోంది. ఈ క్రమంలోనే ఆ టీసీ ఎలాగైనా ట్రైన్ ఎక్కాలని భావించాడు. రైలు ఆపాలని క్యాబిన్‌లో ఉన్న లోకో పైలట్ సైగలు చేశాడు. అలానే రైలు వెంట పరిగెత్తాడు.

సగం మూసుకుపోయిన తలుపుల ద్వారా లోపలికి ఎక్కేందుకు యత్నించి విఫలమయ్యాడు. మరో విషయం ఏంటంటే ఆ ఫ్లాట్‌ఫాం తడిగా ఉంది. దీంతో అతను అదుపుతప్పి కిందపడిపోయాడు. అయితే చుట్టుపక్కల ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారు. అతడ్ని పక్కకు లాగారు. ఒకవేళ అతడు రైలుకు, పట్టాల మధ్య ఇరుక్కుపోయినట్లైతే ప్రాణాలకే ప్రమాదం ఉండేది. జూన్ 26 న ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటీజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..