వర్షాకాలం వచ్చిందంటే చాలు.. జనావాసాల్లో ఎక్కడ చూసినా కూడా సరీసృపాలే దర్శనమిస్తున్నాయి. వాహనాల్లో, ఇళ్లల్లో, షూస్.. ఇలా ఒకటేమిటి ప్రతీ చోటా పాములే.. పాములు.. అలాంటి ఘటనలు కూడా మనం తరచూ చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి తరహా ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. అదేంటో తెలిస్తే మీరూ షాక్ కావడం ఖాయం.
ఇది చదవండి: నిద్రపోయే భంగిమను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పేయొచ్చు..! ఎలాగో తెల్సా
వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఫోర్ట్ కాంప్లెక్స్లో ఆరు అడుగుల భారీ విషసర్పం కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. సదరు ఫోర్ట్ కాంప్లెక్స్లో పని చేస్తోన్న ఓ ఉద్యోగి బాత్రూమ్లోకి వెళ్లగా టాయిలెట్ సీట్పై పాము దర్శనమిచ్చింది. అది ఇండియన్ ర్యాటల్ స్నేక్ కాగా.. దాన్ని చూడగానే సదరు ఉద్యోగి ఒక్క ఉదుటున అక్కడ నుంచి పరుగో పరుగు పెట్టాడు. అతడి అరుపులకు తోటి ఉద్యోగులు కూడా ఆ సీన్ దగ్గరకు చేరుకున్నారు.
ఇది చదవండి: ‘హాయ్ ఫ్రెండ్స్.! ఈరోజు మా ఫస్ట్ నైట్’.. వీడియో షేర్ చేసిన కొత్త జంట.. ఇదేం బూతు పురాణం
వెంటనే టాయిలెట్ తలుపులు మూసేసి.. స్థానిక స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకొని అత్యంత జాగ్రత్తగా.. సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును బంధించారు. అనంతరం ఓ మారుమూల అడవికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ ఘటనలో ఎవ్వరికీ కూడా ఎలాంటి హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ప్రస్తుతం ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల నీరు నిలిచిపోవడంతో.. పాములు బయటకొచ్చి.. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
ఇది చదవండి: ఆడది కాదు.. ఆడపులి.! ఒంటిచేత్తో భారీ కొండచిలువను ఎలా ఉడుంపట్టు పట్టిందో చూస్తే
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..