
రోజూవారి కూలీపనుల నిమిత్తం వలస వచ్చే కొందరికి జాగా ఉండదు. అలాగే అలాంటి వారు రోడ్డు మీదనో.. లేదా ఫుట్పాత్ మీదనో నిద్రపోతుంటారు. సరిగ్గా ఈ వ్యక్తి కూడా అంతే.! తన పని ముగించుకుని రాత్రివేళ ఫుట్పాత్పై పడుకున్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన చూస్తే.. మీ గుండెలు అదిరిపోతాయ్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు మీదున్న ఫుట్పాత్పై హాయిగా నిద్రపోతున్నాడు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో.. ఏమో.. ఓ ఆడసింహం అటుగా వచ్చింది. తనకు కావాల్సిన ఫుడ్ లభించలేదనుకుంట.. కోపంగా నడుచుకుంటూ వెళ్లింది. అలాగే అతడ్ని కూడా ఓసారి వాసన చూసి.. అక్కడ నుంచి తుర్రుమనది.
ఆ తర్వాత సీన్ ఏంటో ఎవ్వరికీ తెలియకపోగా.. వన్ మినిట్ నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇప్పటికే 1.2 మిలియన్ల మంది వీక్షకులు చూశారు. అలాగే వరుసపెట్టి కామెంట్స్తో హోరెత్తించారు. ఇది ఏఐ వీడియో అని కొందరు.. ఈ వీడియో చూస్తే మళ్లీ సదరు వ్యక్తి ఫుట్పాత్పై పడుకునే ధైర్యం చేయడని ఇంకొందరు కామెంట్ చేశారు. కాగా, ఇది అసలు ఎక్కడ జరిగింది.? ఏంటి.? అని విశ్లేషించగా.. ఇది ఓ యూట్యూబ్ ఛానెల్కు సంబంధించిన వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి.. ఏఐతో సృష్టించారని తెలుస్తోంది. ఇక ఇది ఏఐ వీడియో కావడంతో నెటిజన్లు విపరీతంగా ఆశ్చర్యపోయారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..