Viral News: మహిళ శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాక పుట్టింటికి..

|

Jul 15, 2024 | 5:33 PM

మీరు ఇప్పటి వరకూ ఎన్నో రకాల వైరల్ వార్తలు, వీడియోలు చూసే ఉంటారు. కానీ ఈ న్యూస్ మాత్రం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి ఛాలెంజ్‌లు కూడా ఉంటాయా? అని ఇప్పుడే తెలిసింది. సీఎం చంద్రబాబు కారణంగా ఇప్పటి వరకూ పుట్టింటికి ఓ మహిళ దూరమైంది. అదేంటా? అనుకుంటున్నారా.. చాలా మంది అభిమాన రాజకీయ నేతలు, హీరోలు, హీరోయిన్లు ఉంటారు. టీడీపీని ఎంతగానో ప్రేమించే ఈ మహిళ తన అభిమాన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు..

Viral News: మహిళ శపథం.. చంద్రబాబు సీఎం అయ్యాక పుట్టింటికి..
Viral News
Follow us on

మీరు ఇప్పటి వరకూ ఎన్నో రకాల వైరల్ వార్తలు, వీడియోలు చూసే ఉంటారు. కానీ ఈ న్యూస్ మాత్రం వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి ఛాలెంజ్‌లు కూడా ఉంటాయా? అని ఇప్పుడే తెలిసింది. సీఎం చంద్రబాబు కారణంగా ఇప్పటి వరకూ పుట్టింటికి ఓ మహిళ దూరమైంది. అదేంటా? అనుకుంటున్నారా.. చాలా మంది అభిమాన రాజకీయ నేతలు, హీరోలు, హీరోయిన్లు ఉంటారు. టీడీపీని ఎంతగానో ప్రేమించే ఈ మహిళ తన అభిమాన పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్‌కి మరలా ముఖ్యమంత్రిగా అయ్యే వరకు కూడా పుట్టింట్లో అడుగు పెట్టని శపథం చేసింది. ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో పుట్టింటికి వచ్చింది ఆ మహిళ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవా పురం గ్రామానికి చెందిన కట్టా విజయ లక్ష్మీ అనే మహిళ 2019లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని, లేదంటే తన పుట్టింటికి రానని చాలెంజ్ చేసింది. కట్ చేస్తే.. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడంతో తన చాలెంజ్ ప్రకారం పుట్టింటికి దూరం అయ్యింది.

అయితే ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడంతో.. విజయ లక్ష్మి 5 సంవత్సరాల తర్వాత తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో గ్రామస్తులు, కుటుంబ సభ్యులు విజయ లక్ష్మి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి.. విజయ లక్ష్మిని సన్మానించి ఆ తర్వాత పూలు జల్లుతూ ఇంటికి ఘనంగా స్వాగతం పలికారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.