ఆహార వేటలో భాగంగా జంతువుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒక జంతువుకు చెందాల్సిన ఆహారాన్ని.. మరో జంతువు ఎగరేసుకుని పోవడం మనం చూస్తూనే ఉంటాం. అడవిలో ఇలాంటి యుద్దాలు సర్వసాధారణం. ఇక తాజాగా ఈ కోవలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జింకను వేటాడటానికి అటు చిరుతపులి, ఇటు హైనా పోటాపోటీగా యుద్ధం చేసుకోగా.. ఇంతలో రెండు మొసళ్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇక చివరికి ఏం జరిగిందో చూస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మరి లేట్ ఎందుకు ఓసారి లుక్కేయండి.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ సరస్సుకు దగ్గరలో జింకను వేటాడి.. దాన్ని కళేబరాన్ని తినేందుకు చిరుతపులి ఇంచక్కా సేద తీరుతోంది. ఈలోగా అటుగా వచ్చిన హైనా.. అది గమనించి.. చిరుత నోటికాడ ఉన్న ఆహారాన్ని లాక్కుని పోతుంది. చిరుతేమో ఎందుకులే మనకొచ్చిన రభస అని.. హైనా నుంచి దూరంగా వెళ్లిపోయి.. చూస్తూ ఉండిపోయింది. ఇక ఇంతలో ఎక్కడ నుంచి వచ్చాయో ఏమో.. రెండు మొసళ్లు ఒడ్డుకు వచ్చి.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ రెండింటి ఆగమనాన్ని గమనించిన చిరుత.. ‘నాకెందుకు వచ్చింది ఈ గొడవ అని పక్కకు తప్పుకుంది’. ఇక మొసళ్లు రెండు హైనా దగ్గరకు చేరుకొని.. జింక కళేబరాన్ని తమ నోటికి లాక్కున్నాయి. చివరికి చిరుత, హైనాలకు.. మొసలితో పోటీపడలేక.. ఓడిపోయాయి. ఆఖర్లో రెండు మొసళ్లు.. ఆ జింక కళేబరాన్ని నోట కరుచుకుని సరస్సులోకి తీసుకెళ్ళిపోయాయి. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్తో హోరెత్తిస్తున్నాయి.