
కాన్పూర్లోని శాస్త్రి నగర్లో జరిగిన ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని అమ్మేశాడు. అది కూడా ఏదో పెద్ద ఆపద వచ్చి అమ్మేశాడేమో అనుకునేరు.. జస్ట్ మ్యాగీ నూడుల్స్ కొనడానికి ఉంగరంతో ఒక ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు. ఈ సంఘటన పిల్లలకు నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్కి ఎంత అడిక్ట్ అవుతున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఆభరణాల దుకాణ యజమాని ఆ కుర్రాడి తల్లికి ఫోన్ చేయడంతో చివరికి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
ఓ బాలుడు ఒక ఆభరణాల దుకాణంలోకి వెళ్లి తన దగ్గర బంగారపు ఉంగరం ఉంది కొంటారని అని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ ఆ బాలుడి అమాయకత్వాన్ని గమనించి.. ఈ ఉంగరం ఎందుకు అమ్ముతున్నావ్ అని అడిగ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ బాలుడు నిజాయితీగా మ్యాగీ కొనడానికి డబ్బు కావాలని ఆ ఉంగరాన్ని తెచ్చానని సమాధానం ఇచ్చాడు.
ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ నగల వ్యాపారి వెంటనే ఆ అబ్బాయి తల్లిని దుకాణానికి పిలిచి ఆ ఉంగరాన్ని చూపించాడు. ఆ తల్లి షాక్ అయి, అది తన కూతురి నిశ్చితార్థ ఉంగరమని నిర్ధారించుకుంది. తన పెళ్లి కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఆమె చెప్పింది. తన మార్కెట్లోని ఏ దుకాణదారుడు కూడా సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన వస్తువులను కొనుగోలు చేయదని పుష్పేంద్ర జైస్వాల్ అన్నారు. ఆ బిడ్డ అమాయకత్వాన్ని చూసి చలించిపోయి, అతను ఆ ఉంగరాన్ని తల్లికి తిరిగి ఇచ్చాడు. ఆమె తన కొడుకుతో దుకాణం నుండి బయటకు వెళ్ళినప్పుడు, ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి