రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?

|

Sep 10, 2019 | 3:49 PM

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపోయి ముందుకు పరుగులు తీశాయి. దీంతో భక్తులంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు మహిళలు సహా 17మంది గాయపడ్డారు. […]

రెచ్చిపోయిన గజరాజులు..17 మందికి గాయాలు.. అసలేమైంది ?
Follow us on

శ్రీలంకలో ఓ మతపరమైన ఊరేగింపు భక్తుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో రెండు ఏనుగులను ఘనంగా అలంకరించి నిర్వాహకులు తీసుకువచ్చారు. సాధారణంగా గజరాజులు ఇలాంటి సెలబ్రేషన్స్ లో నిబ్బరంగా పాల్గొంటాయి. మావటీలు ముందుగానే అలా వాటికి శిక్షణ ఇస్తారు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఏనుగులు ఉన్నట్టుండి.. రెచ్చిపోయి ముందుకు పరుగులు తీశాయి. దీంతో భక్తులంతా భయంతో తలో దిక్కుకూ పారిపోయారు. ఈ తొక్కిసలాటలో కొందరు మహిళలు సహా 17మంది గాయపడ్డారు. పైగా ఓ గజరాజుపై నుంచి మావటీ కింద పడిపోయాడు. అనుకోని ఈ హఠాత్ సంఘటన అందర్నీ నిశ్చేష్టుల్ని చేసింది.
కాగా-ఒక్కోసారి ఏనుగులు అత్యంత దూకుడుగా ప్రవర్తిస్తాయని, ఇందుకు వీటి హార్మోన్లు కారణమని జయంత్ జయవర్దనే అనే జంతు నిపుణుడు తెలిపాడు. పండుగలు, పబ్బాలు లేదా ఈ విధమైన మతపరమైన కార్యక్రమాల్లో గజరాజులను వినియోగించే ముందు వాటి ప్రవర్తన ఎలా ఉందో నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నాడు. బహుశా ఏనుగులు తమ బ్రీడింగ్ సీజన్ లో ఇలా రెచ్చిపోతుంటాయని, ఆ సమయంలో వాటిని అదుపు చేయడం కష్టమవుతుందని ఆయన చెప్పాడు. మావటీలు ముఖ్యంగా మగ గజరాజుల నడవడికపై ప్రధానంగా దృష్టి పెట్టవలసి ఉంటుందని జయవర్ధనే అన్నాడు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా గాయాలు తగలలేదు. అయితే భక్తులు, ఇతరులు భయంతో వణికిపోయారు.