Dog: అదృష్టం అంటే ఈ కుక్కదే.. బిజినెస్ క్లాస్లో దర్జాగా ప్రయాణించింది.. ఖర్చు తెలిస్తే షాకే..
Dog owner books plane: ఓ కుక్క విమానంలో దర్జాగా ప్రయాణించింది.. అది కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్లో దర్జాగా కూర్చొని తన గమ్యానికి చేరింది. పెంపుడు కుక్క కోసం దాని
Dog owner books plane: ఓ కుక్క విమానంలో దర్జాగా ప్రయాణించింది.. అది కూడా బిజినెస్ క్లాస్ క్యాబిన్లో దర్జాగా కూర్చొని తన గమ్యానికి చేరింది. పెంపుడు కుక్క కోసం దాని యజమాని ఏకంగా ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్ క్యాబిన్ మొత్తాన్ని బుక్ చేశాడు. దీంతో ఆ బుజ్జి కుక్క ఎంతో దర్జాగా, లగ్జరీగా విమానంలో ముంబై నుంచి చెన్నైకి ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఎయిర్ ఇండియా బిజినెస్ క్లాస్లో గతంలో కూడా పెంపుడు కుక్కలు ప్రయాణించాయి. కానీ.. ఒక పెంపుడు కుక్క కోసం బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేయడం ఇదే తొలిసారని ఎయిర్లైన్స్ అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. ఈ కుక్క రెండు గంటలపాటు ప్రయాణించేందుకు దాని యజమాని ఏకంగా మూడు లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొంటున్నారు.
అయితే.. ఎయిర్ ఇండియా ఏ320 విమానంలోని జే క్లాస్లో 12 సీట్లు ఉంటాయి. ముంబై నుంచి చెన్నైకి బిజినెస్ క్లాస్ సీటు ఛార్జీ సుమారు రూ.20వేల వరకు ఉంటుంది. ఈ లెక్కన పెంపుడు కుక్క రెండు గంటల ప్రయాణం కోసం రూ.2.5 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో పెంపుడు జంతువులను విమానాల్లో అనుమతించే ఏకైక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులను మాత్రమే విమానంలోకి అనుమతిస్తారు. అయితే.. టికెట్ బుక్ చేసుకునే వారి సంబంధిత క్లాస్లోని చివరి వరుస సీటులో వాటిని కూర్చొడానికి అనుమతిస్తారు. ఇదిలాఉంటే.. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఎయిర్ ఇండియా డొమస్టిక్ విమానాల్లో దాదాపు రెండు వేలకుపైగా పెంపుడు జంతువులు ప్రయాణించినట్లు సంస్థ అధికారులు తెలిపారు.
Also Read: