కెన్యాలోనూ అమెరికాకు ఎదురుగాలి.. యుఎస్ మిలిటరీ బేస్పై దాడి
ఇరాన్, ఇరాక్ తరువాత అమెరికాకు ఇప్పుడు కెన్యాలోనూ ఎదురుగాలి వీస్తోంది. ఆ దేశ కోస్తా తీరంలోని లామూ ప్రాంతంలో గల యుఎస్ సైనిక బేస్ లో ఆదివారం సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూపు సభ్యులు దూసుకు వచ్చి .. ఈ మిలిటరీ స్థావరంపై దాడులకు పాల్పడడమే గాక.. ముగ్గురు అమెరికన్లను హతమార్చారు. అమెరికాకు చెందిన పలు విమానాలను, సైనిక వాహనాలను ధ్వంసం చేశారు. క్యాంప్ సింబాలో హెవీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు ముందుకు చొచ్చుకురాగా.. వారిని అమెరికన్ […]
ఇరాన్, ఇరాక్ తరువాత అమెరికాకు ఇప్పుడు కెన్యాలోనూ ఎదురుగాలి వీస్తోంది. ఆ దేశ కోస్తా తీరంలోని లామూ ప్రాంతంలో గల యుఎస్ సైనిక బేస్ లో ఆదివారం సోమాలియాకు చెందిన అల్-షబాబ్ గ్రూపు సభ్యులు దూసుకు వచ్చి .. ఈ మిలిటరీ స్థావరంపై దాడులకు పాల్పడడమే గాక.. ముగ్గురు అమెరికన్లను హతమార్చారు. అమెరికాకు చెందిన పలు విమానాలను, సైనిక వాహనాలను ధ్వంసం చేశారు. క్యాంప్ సింబాలో హెవీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ వారు ముందుకు చొచ్చుకురాగా.. వారిని అమెరికన్ సైనికులు వెనక్కి తరిమారు. ఈ ఘటనలో నలుగురు అల్-షబాబ్ సభ్యులు మరణించారు. అయితే తాము 17 మంది అమెరికన్లను హతమార్చామని, తమ దాడిలో 9 మంది కెన్యా సైనికులు కూడా మృతి చెందారని ఈ గ్రూపు చెప్పుకుంది. కానీ అధికారవర్గాలు ఈ ప్రకటనను తోసిపుచ్చాయి. 2011 లో కెన్యా సోమాలియాలోకి తన సైనికులను పంపుతున్నప్పటి నుంచి అల్-షబాబ్ తరచూ క్రాస్ బోర్డర్ చేస్తూనే ఉంది. కెన్యాలో అమెరికా దళాల ఉనికిని ఈ సంస్థ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.