హైదరాబాద్‌కు బయలు దేరిన సిల్క్ ఎయిర్ విమానం

లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది అక్క‌డి తెలుగు స‌మాజం. వారి సౌజ‌న్యంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బ‌య‌ల్దేరారు...

హైదరాబాద్‌కు బయలు దేరిన సిల్క్ ఎయిర్ విమానం
Follow us

|

Updated on: Jun 18, 2020 | 11:44 AM

లాక్‌డౌన్ కార‌ణంగా సింగ‌పూర్‌లో చిక్కుకుపోయిన తెలుగు ప్ర‌వాసుల‌ను స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేసింది అక్క‌డి తెలుగు స‌మాజం. వారి సౌజ‌న్యంతో రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన‌ 146 మంది సిల్క్ ఎయిర్ విమానంలో సింగపూర్ నుండి బ‌య‌ల్దేరారు. వీరిలో 82 మంది తెలంగాణ వారు, 62 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ వారు ఉన్నారు. వీరితోపాటు ఇద్ద‌రు త‌మిళ‌నాడుకు చెందిన వారు కూడా ఉన్నారు. సిల్క్ ఎయిర్ విమానం శంషాబాద్ కు చేరుకోనుంది. ఈ విమానం ఏర్పాటులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో స‌హ‌క‌రించార‌ని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటి రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కిషన్ రెడ్డికి ఆయ‌న‌ ప్ర‌త్యేకంగా ధన్యవాదములు తెలిపారు. వారితోపాటు

అయితే.. సింగపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ఈ నెల 11న హైదరాబాద్‌‌కు‌ ప్ర‌త్యేక విమానం ఏర్పాటు చేశారు. ఈ విమానంలో తెలుగు వారిని స్వ‌దేశానికి పంపించ‌డం జ‌రిగింది.