పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్!
తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. అత్తవారింట్లో అనుకువగా నడుచుకోవాలని చెప్పడమే కాదు.. భర్తతో ఎన్ని గొడవలు వచ్చినా సర్డుకుపోవాలని నచ్చజెప్పారు. కట్ చేస్తే.. 4 రోజులకే తిరిగి పుట్టింటికి వచ్చేసింది ఆ నవవధువు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి తల్లిదండ్రులు..
తమ కూతురికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు ఆ తల్లిదండ్రులు. అత్తవారింట్లో అనుకువగా నడుచుకోవాలని చెప్పడమే కాదు.. భర్తతో ఎన్ని గొడవలు వచ్చినా సర్డుకుపోవాలని నచ్చజెప్పారు. కట్ చేస్తే.. 4 రోజులకే తిరిగి పుట్టింటికి వచ్చేసింది ఆ నవవధువు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ యువతి తల్లిదండ్రులు.. అసలేం జరిగిందని ఆరా తీయగా.. అల్లుడు చెప్పిన కారణానికి దెబ్బకు కంగుతిన్నారు. ‘మీ అమ్మాయి ఇంట్లో అన్నం తినడం లేదని.. కేవలం జ్యూసులు మాత్రమే తాగుతోందని’ అది నచ్చకే పుట్టింటికి పంపించినట్టు చెప్పుకొచ్చాడు. దీంతో ఆ నవ వధువు, ఆమె తరపు బంధువులు కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. బెల్లంపల్లి మండలం కసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ప్రవీణ్కు మంచిర్యాలకు చెందిన ఓ యువతితో ఏప్రిల్ 24న వివాహమైంది. కట్ చేస్తే.. పెళ్లైన నాలుగో రోజే భర్త ప్రవీణ్.. వధువును తీసుకొచ్చి పుట్టింటి దగ్గర విడిచిపెట్టాడు. ఎందుకని అడగ్గా.. ఆమె ఇంట్లో అన్నం తినడం లేదని, జ్యూస్లే తాగుతోందని అతడు చెప్పినట్టు సదరు యువతి తల్లిదండ్రులు చెప్పారు. దీనికి వరుడు తల్లిదండ్రులు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. తమకేది సంబంధం లేదన్నట్టు సమాధానం ఇస్తున్నారని యువతి కుటుంబసభ్యులు తెలిపారు. నిర్లక్ష్యపు మాటలతో మాట దాటవేస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆ నవ వధువు, ఆమె తరపు బంధువులు కలిసి భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టారు. తమ అమ్మాయితో కాపురం చేయడం అతడికి ఇష్టం లేదని.. ఇంటికి వస్తే తాళం వేసుకుని బయటకు వెళ్తున్నారని యువతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ అంశంపై స్థానిక ఎస్సై నరేష్ ఇరు వర్గాల వారిని కౌన్సిలింగ్కు రావాలని కోరారు.