ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్ ను ఢీ కొని అదుపుతప్పిన కారు.. ఇద్దరు మృతి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్పై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన రెండు కార్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి.
కాగా.. కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై.. పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకుని స్పాట్ ను, మృతదేహాలను పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
వరసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఔటర్ పరిధిలో ఉన్న గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం